శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల వైభవంగా జరుగుతున్నాయి.బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున దేవాదాయశాఖ మంత్రి ఆనం నారాయణరెడ్డి,శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డారాజశేఖర్ రెడ్డి,శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవారికి ఆనవాయితీగా పట్టు వస్త్రాలు సమర్పించారు.ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి ఆనం నారాయణరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి శ్రీశైలం ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు,ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం శ్రీస్వామి అమ్మవార్ల పట్టువస్త్రాలకు అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.