మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును రాష్ట్ర గనుల కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. ఎమ్మెల్యే చికిత్స పొందుతున్న హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో ఎమ్మెల్యేను పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులకు సూచన చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.