కొండపి: జరుగుమల్లి మండలంలోని జాతీయ రహదారిపై లారీ ద్విచక్ర వాహనండీ, ఓ వివాహిత మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం జాతీయ రహదారిపై వెళుతున్న బైక్ని లారీ ఢీకొనడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఒంగోలు భాగ్యనగర్కి చెందిన శాంతకుమారి, మరో వ్యక్తితో కలిసి జరుగుమల్లిలో శుభకార్యానికి బైకుపై వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. లారీతో డ్రైవర్ పరారీ కాగా సింగరాయకొండ సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.