ప్రకాశం జిల్లా ఒంగోలు నగర పరిధిలో రోడ్డున ఆక్రమించి వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులకు ఆదివారం ట్రాఫిక్ పోలీసులు కట్టడి చేశారు. వ్యాపారాన్ని రోడ్డుపైకి రాకుండా వాహనదారులకు ఇబ్బంది లేకుండా చేసుకోవాలని పలుమార్లు చెప్పినప్పటికీ వినకుండా రోడ్డున అక్రమిస్తున్నారని ఇదే పదేపదే జరిగితే చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. రోడ్డుపై తోపుడుబండ్లతో వ్యాపారం చేస్తున్న వారిని హెచ్చరించినప్పటికీ వినకపోవడంతో అదుపులోకి తీసుకొని చర్యలు చేపట్టారు. త్వరలో వ్యాపారస్తులకు ప్రదేశాన్ని నిర్ణయిస్తామని ఎవరు కూడా రోడ్డుపైకి వచ్చి ట్రాఫిక్ ఇబ్బంది కలగకూడదంటూ సే జగదీష్ గారికి తెలియజేశారు