కడప జిల్లా చక్రాయపేట మండలం లోని ఎర్రగుడి తండాలో గురువారం వీధికుక్కల దాడిలో 6 గొర్రె పిల్లలు మృత్యువాతపడ్డాయిమరికొన్ని గొర్రెలకు గాయాలయ్యాయి. తాండాకు చెందిన దేశే గంగే నాయక్ తన గొర్రెలను గ్రామ సమీపంలో ఉన్న షెడ్లో పెట్టి బయటకు వెళ్లారు. ఆ సమయంలో వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేసి 6 గొర్రె పిల్లలను చంపేశాయి. మరికొన్ని గొర్రెలకు గాయాలయ్యాయి. సుమారు రూ. 40 వేలు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధిత కాపరి వాపోయారు.