విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందనే సాకుతో ప్రభుత్వం రాష్ట్రంలో 960 పాఠశాలలను మూసి వేయడానికి చర్యలు తీసుకుంటున్నదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అన్నారు. తాడిపత్రిలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆయన మాట్లాడారు. పాఠశాలలను మూసివేసే ఆలోచనను విరమించుకోవాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలన్నారు. ఉపాధ్యాయులపై జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు. ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నిర్వహించకూడదన్నారు. అన్ని సమస్యల పైన మండలిలో చర్చిస్తానన్నారు.