తిరుమల శ్రీవారి సేవలో గవర్నర్ అబ్దుల్ నజీర్
తిరుమల శ్రీవారిని గవర్నర్ అబ్దుల్ నజీర్ కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు. ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచన అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అలాగే స్వామివారి పట్టు వస్త్రంతో ఆయనను సత్కరించారు.