కాణిపాకం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని మహారాష్ర్ట నందెడ్ రాజ్యసభ సభ్యులు అజిత్ మాధవరావు గోపచడే స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఏఈఓ రవీంద్రబాబు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేసి వేద పండితులచే ఆశీర్వచనాలు నిర్వహించి స్వామివారి తీర్థప్రసాదాలు మరియు చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపర్డెంట్ కోదండపాణి టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, తదితరులు ఉన్నారు.