ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 7వ తేదీన పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. అందులో భాగంగా ఏలూరు జిల్లాలో సీఎం పర్యటిస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలవరం ప్రాంతం ఫ్లెక్సీలతో కోలాహలంగా మారింది. మంగళవారం అధికారుల బృందం ప్రాజెక్టు వద్ద పనులను వేగవంతం చేస్తూ, ఏర్పాట్లను నిశితంగా పర్య వేక్షిస్తోంది. ఎక్కడా ఎటువంటి లోపాలు తలెత్తకుండా భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించడంతో పాటు పలు కీలక ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది.