ఘనంగా చిత్తూరు నియోజకవర్గం తెదేపా కార్యవర్గాల ప్రమాణ స్వీకారం తెలుగుదేశం పార్టీలో నూతనంగా పదవులు పొందిన వారంతా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ ప్రజల్లోకి తీసుకెళ్లాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చిత్తూరు నియోజకవర్గ పరిధిలోని చిత్తూర్ అర్బన్, గుడిపాల, చిత్తూరు రూరల్ మండల, క్లస్టర్, టౌన్, యూనిట్, అనుబంధ సంఘాల కార్యవర్గాల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నియమించబడిన సభ్యుల చేత పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తామని, పార్టీ అభ్యున్నతి కోస