యాడికి మండలం గుడిపాడు లోని సిమెంట్ ఫ్యాక్టరీలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో టెన్త్ లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. సిమెంట్ ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ రంగారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. మొత్తం 30 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. ప్రధమ బహుమతి కింద రూ.20 వేలు, సెకండ్ బహుమతి రూ.15 వేలు,థర్డ్ బహుమతి రూ.10 వేలు చొప్పున అందజేశారు. అంతేకాకుండా సర్టిఫికెట్లు కూడా అందజేశారు.