నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని పైపాలెం గ్రామంలో శుక్రవారం మండల పరిషత్ పాఠశాల ప్రాంగణంలో జరిగిన గ్రీన్ కో సోలార్ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది.గ్రీన్ కో మేనేజర్ శివప్రసాద్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.ఈ వైద్య శిబిరానికి 112 మంది హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నట్లు ఆయన తెలిపారు.డాక్టర్ మన్సూర్, డాక్టర్ లాలు యాదవ్ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు.బీ పీ,షుగర్,జ్వరం,ఒళ్ళు నొప్పులు,ముక్కు,గొంతు నొప్పి తదితర వాటికి డాక్టర్లు పరీక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మర్రి రామచంద్రుడు,మాజీ సర్పంచ్ టీడీపీ నాయకులు వై