ఒంగోలులోనే త్రిబుల్ ఐటీ ఉంచాలని విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు రాయపాటి జగదీష్ డిమాండ్ చేశారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఒంగోలు ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఆనాడు త్రిబుల్ ఐటీ కేటాయించారన్నారు. ఇక్కడి కాలేజీని కనిగిరి ప్రాంతం బల్లిపల్లికి కేటాయిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని చెప్పారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు.