కేవి.పల్లిలో రోడ్డు ప్రమాదాల పై ప్రజలకు ఎస్ఐ శివకుమార్ ఆదివారం అవగాహన కల్పించారు.ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. 18ఏళ్ల లోపు పిల్లలు వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి చేస్తే, వారి పైన తల్లిదండ్రులపైన, వాహనాలు ఇచ్చిన వారిపైన చట్ట ప్రకారం కేసులు నమోదు చేయడం జరిగుతుందని హెచ్చరించారు. నాలుగు చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనం నడిపితే చర్యలు తప్పవని వాహనదారుల ను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు