అదిలాబాద్ అర్బన్: ఇచ్చోడ సమీపంలో ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు డ్రైవర్ ప్రయాణికులను దింపేయడంతో తప్పిన పెను ప్రమాదం
ADB :ఆర్టీసీ బస్సులో ఒకేసారి మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్ ప్రయాణికులను బస్సు నుండి దింపివేయడంతో పెను ప్రమాదమే తప్పింది. ఆదిలాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఆదిలాబాద్ నుండి నిజాంబాద్ వెళ్తున్న క్రమంలో ఇచ్చోడ మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాల వద్ద బస్సులో నుండి ఒకేసారి పొగతో పాటు మంటలు చెలరేగాయి. ఆర్టీసీ బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అటువైపుగా వెళుతున్న మినరల్ వాటర్ ఆటోను ఆపి నీటితో మంటలు అదుపు చేయడానికి కొందరు ప్రయత్నించిన కూడా మంటలు అదుపులోకి రాకపోవడంతో ఫైర్ స్టేషన్ సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి హుటాహుటిగా చేరుకున్న ఫైర్ సిబ్బంది