అమాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తున్న సిరివెళ్ల సిఐ దస్తగిరి బాబు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సోమవారం సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు నంద్యాల జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు, సిరివెళ్ల కు చెందిన దళితుడు పాములేటి పై అక్రమ కేసులు పెడుతూ సిఐ అధికార పార్టీకి తొత్తులుగావ్యవహరిస్తున్నారని వారు ఆరోపించారు, నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న సిఐ పై శాఖపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు, ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు