ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువారం నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని తీవ్రంగా గాయపడి ఇద్దరినీ అంబులెన్స్ లో మొదట స్థానికంగా ప్రధమ చికిత్స అందించి తర్వాత మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై సమాచారాన్ని అందుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.