రాయదుర్గం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో కందుల కొనుగోలు కేంద్రాన్ని రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవశ్రీనివాసులు ప్రారంభించారు. సోమవారం ఉదయం మార్కెట్ కమిటీ చైర్మన్ గొడిశలపల్లి హనుమంతరెడ్డి, మార్క్ ఫెడ్ డిఎం పెన్నేశ్వరి, ఏడిఏ పద్మజ పలువురు అధికారులతో కలిసి తేమ శాతాన్ని పరిశీలించి రైతుల నుంచి కందుల కొనుగోలు ప్రారంభించారు. క్వింటాలు రూ. 8 వేల కనీస మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు.