ప్రకాశం జిల్లా కొండపి మండలం కే.ఉప్పలపాడు ZPHSలో శుక్రవారం బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు ప్రధానోపాధ్యాయురాలు సుసన్న కుమార్ చిన్నారులందరికి బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చాచా నెహ్రూ గురించి వివరించారు. విద్యార్థులకు పలు అంశాలపై అవగాహన కలిగించారు. రాజ్యాంగం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఎస్ఎంసి ఛైర్మన్ రాఘవేంద్ర శర్మ పాల్గొన్నారు.