ప్రకాశం జిల్లాలో అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. ముఖ్యంగా గిద్దలూరు, మార్కాపురం, దోర్నాల, పొదిలి, కొండపి, ఎర్రగొండపాలెం, దర్శి, ఒంగోలు ప్రాంతాలలో కంది, మిర్చి, మొక్కజొన్న పంటలు వేసిన రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. అప్పు చేసి మరి పెట్టుబడి పెట్టామని అకాల వర్షాలు తమను నిండా ముంచాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.