నంద్యాల జిల్లాలోని మహా పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యాలు, భద్రతపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఆత్మకూరు నుండి శ్రీశైలం వెళ్లే కాలినడక మార్గాన్ని జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ స్వయంగ పరిశీలించారు,కాలినడక మార్గం, భక్తులు నడుస్తున్న రహదారులను పరిశీలించారు,మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో దేశం నలుమూలల నుండి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ నల్లమల ప్రాంతాన్ని పరిశీలించారు,