ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని రైతు సేవా కేంద్రాలలో రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి లైవ్ ప్రోగ్రాం రైతులు గ్రామ వ్యవసాయ సహాయకులు కలిసి వీక్షించినట్లు మండల వ్యవసాయ అధికారిని బుజ్జి భాయి తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్క రైతు సేవా కేంద్రానికి వెళ్లి పరిశీలించడం జరిగిందన్నారు. ఈ ప్రోగ్రాం లో సీఎం చంద్రబాబు చెప్పిన ఐదు సూత్రాలను పాటించాలని తెలిపారు. రానున్న ఐదు సంవత్సరాల కాలంలో రైతును రాజును చేసేందుకు ఐదు విధానాలతో కార్యచరణ అమలు చేస్తున్నట్లు తెలిపారు.