వ్యవసాయ రంగంలో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని రైతుల సమస్యలకు పరిష్కారం చూపే అగ్రిటెక్ స్టార్టప్ లను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో వ్యవసాయ, ఉద్యాన, అనుబంధ రంగాల అధికారులతో మరియు రైతు ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో అగ్రిటెక్ స్టార్టప్ లను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం నుంచి అవసరమైన రుణాల మంజూరు, సబ్సిడీ, ఉత్పత్తులను ప్రమోట్ చేయడం లాంటి సహకారం ఇస్తామన్నారు.