ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం దావగూడూరు-చిర్రికూరపాడు గ్రామాల మధ్య ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. టంగుటూరు నుంచి కామేపల్లి వైపు వెళ్తున్న బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్లలోకి దూసుకెళ్లింది. బైక్పై ఇద్దరు యువకులు ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగింది. వాహనం నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా, వెనుక కూర్చున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా స్థానికులు అంబులెన్స్కు ఫోన్ చేసి హాస్పిటలు తరలించారు.