అనంతపురం జిల్లా బండమీద పల్లి చక్రాయపేట గ్రామ మధ్యలో ద్విచక్ర వాహనాన్ని ఇన్నోవా వాహనం ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Oct 19, 2025
అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని సింగనమల మండలం బండమీద పల్లి చక్రాయపేట గ్రామ మధ్యలో ద్విచక్ర వాహనాన్ని ఇన్నోవా వాహనం ఢీకొన్న ఘటనలో బండమీద పల్లి గ్రామానికి చెందిన చాకలి వెంకట పుల్లయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతని పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన అతనినీ 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.