కందుల కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ కాట్రెడ్డి మల్లికార్జున రెడ్డి,మార్క పేడ్ జిల్లా అధికారి హరినాథ్ రెడ్డిలు పేర్కొన్నారు.పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు మార్కెట్ యార్డ్ చైర్మన్ కాట్రెడ్డి మల్లికార్జున రెడ్డి మార్క్ పేడ్ జిల్లా అధికారి హరినాథ్ రెడ్డిలు కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కందుల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కందులకు ప్రభుత్వం క్వింటాకు 8వేల ధర ప్రకటించిందని తెలిపార