సంగారెడ్డి: కొండాపూర్ మండలంలో త్రిబుల్ ఆర్ ప్రాజెక్టు కింద భూసేకరణ నిలిపివేయాలని కోరుతూ మాజీ మంత్రి హరీష్ రావు కు వినతి పత్రం అందజేత
కొండాపూర్ మండలంలో ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టు కింద భూసేకరణను నిలిపివేయాలని కోరుతూ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో రైతులు మాజీ మంత్రి హరీష్ రావుకు సోమవారం వినతి పత్రం సమర్పించారు. ఆర్ఆర్ఆర్ కింద తమ భూములు తీసుకుంటే ఉపాధి కోల్పోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అలైన్మెంట్ మార్చేలా చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, రైతులు పాల్గొన్నారు.