ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డు జంక్షన్ లో ట్రాఫిక్ సిఐ జగదీష్ మంగళవారం ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై అవగాహన కార్యక్రమాన్ని కల్పించారు. రోడ్ సేఫ్టీ వారియర్స్ మరియు ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ హెల్మెట్ ధరించిన వారిని హెచ్చరించారు తొలిసారిగా హెల్మెట్ ధరించని వారికి హెచ్చరిక జారీ చేయడం జరుగుతుందని మరోసారి హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే అపరాధ రుసుము తప్పదని హెచ్చరించారు ద్విచక్ర వాహనదారులు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వారి ప్రాణాలను కాపాడటానికి హెల్మెట్లు ఎంతో ఉపయోగపడతాయన్నారు