శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని పెనుగొండ నియోజకవర్గం పాలసముద్రం వద్ద జాతీయ రహదారిపై రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో అనిల్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన యువకుడిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.