కరీంనగర్: కరీంనగర్ కమీషనరేట్ లో విధులు నిర్వహించే హోంగార్డు పురుగుల మందు తాగి ఆత్మహత్య
కరీంనగర్ లో పోలీస్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. కరీంనగర్ కమిషనరేట్ లో హోంగార్డుగా పనిచేస్తున్న ముద్దసాని కనకయ్య(46) ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆదివారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రుక్మాపూర్ గ్రామానికి చెందిన ఆయన, కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్న సమయంలో సోమవారం తెల్లవారు మరణించాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు చొప్పదండి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తము కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి తరలించారు పోలీసులు.