అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండల పరిధిలోని చియ్యేడు గ్రామంలో ప్రమాదవశాత్తు గ్యాస్ పేలి వడ్డే సాలమ్మ అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.