అనంతపురం నగర పరిధిలోని చెరువు కట్టపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీటెక్ విద్యార్థి చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | Oct 19, 2025
అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఉన్న అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనంతపురం నగరానికి చెందిన భరత్ కుమార్ రెడ్డి అనే బిటెక్ విద్యార్థి చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.