ఇబ్రహీంపట్నం: హయత్ నగర్ లో అర్ధరాత్రి దొంగల బీభత్సం
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి పెద్ద అంబర్పేటలో దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సదాశివ గ్రేటర్ కమ్యూనిటీలో వరుసగా రెండు ఇళ్లలో భారీ చోరీ చేశారు. సెంట్రల్ లాక్ ఉన్న రోడ్ల డోర్లను బద్దలు కొట్టి చోరీకి పాల్పడ్డ దొంగలు ఐదు కేజీల వెండి సామాగ్రి, 35 గ్రాముల బంగారం, 60 వేల నగదు విలువైన చీరలు అపహరించారు. సీసీ కెమెరాలు దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.