అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే జిల్లా బహిష్కరణ చేస్తామని తాడిపత్రి టౌన్ సీఐ ఆరోహణరావు హెచ్చరించారు. తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో ఆయన ఎస్సైలు గౌస్, దయాకర్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు. మట్కా పై ప్రత్యేక నిఘా వేశామన్నారు. ఇప్పటికే పలువురుపై కేసు నమోదు చేశామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే రౌడీషీట్, పీడీ యాక్టులను కూడా నమోదు చేస్తామని హెచ్చరించారు. అందరూ తమ పద్ధతిని మార్చుకొని ప్రశాంతంగా జీవించాలని సూచించారు.