శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం భక్తుల రద్దీ రోజు రోజుకు పెరుగుతోంది. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, పోలీసు శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసింది. భక్తులు తొందరపడకుండా సంయమనం పాటిస్తూ పోలీసుల సూచనలు అనుసరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం నుంచి ఇప్పటివరకు మొత్తం 1,95,555 మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకోగా, అందులో 50,504 మంది శివ స్వాములు ఉన్నారు.