నల్గొండ డిసిసి అధ్యక్షుడిగా పున్న కైలాస్ నేతకు అవకాశం కల్పించడానికి ఓయూ జేఏసీ నాయకులుగా స్వాగతిస్తున్నామని ఓయూ జేఏసీ చైర్మన్ బాలకృష్ణ నేత తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పున్న కైలాస్ నేత నియామకాన్ని జీర్ణించుకోలేని కొందరు నాయకులు ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి తప్పుడు లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే ఆ నాయకులు లేఖలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.