పొలియ వ్యాధితో అంగవైకల్యానికి గురికాకుండా ఐదేళ్లలోపు ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు వేయించాలని వైద్యాధికారి డాక్టర్ రమేష్, డిప్యూటీ హెల్త్ ఎజుకేటర్ కెంచె లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. శుక్రవారం సాయంత్రం రాయదుర్గంలో వారు మాట్లాడుతూ ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు అందే విధంగా కృషి చేయాలని తల్లిదండ్రులను కోరారు. ఈ సందర్భంగా రాయదుర్గం నియోజకవర్గం పరిధిలోని 28 వేల మంది ఐదేళ్లలో పిల్లలకు పోలియో చుక్కలు వేస్తున్నట్లు వివరించారు. అదేవిధంగా 22, 23 తారీకుల్లో 40 వేల ఇండ్లకు ఇల్లు తిరిగి పిల్లలకు పోలియో చుక్కలు వేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అజహర్, యశ్వంత్ రాజ్ పాల్గొన్నారు.