బాల్య వివాహాల నిరోధమే లక్ష్యంగా అన్ని శాఖలతో కలిసి న్యాయ సేవాధికార సంస్థ విశేష కృషి చేస్తోందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీదేవి పేర్కొన్నారు.మంగళవారం ఏలూరు న్యాయ సేవాధికార సంస్థ భవనంలో బాల్య వివాహాల నిరోధక గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కలిగి ఉండాలని, వీటిని ప్రోత్సహించినా లేదా జరిపించినా చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని జడ్జి శ్రీదేవి హెచ్చరించారు. వివాహం చేసుకున్న వ్యక్తితో పాటు వివాహం జరిపించిన తల్లిదండ్రులు కూడా శిక్షలు పొందుతారని తెలిపారు.