నార్నూర్: అర్లి-టీ లో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన డీసీసీబీ ఛైర్మెన్ అడ్డి బోజారెడ్డి,కాంగ్రెస్ పార్లమెంట్ ఇంచార్జీ సుగుణ
ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని డీసీసీబీ ఛైర్మెన్ అడ్డి బోజారెడ్డి అన్నారు.గురువారం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జీ ఆత్రం సుగుణ,బోథ్ నియోజకవర్గం ఇన్చార్జి ఆడే గజేందర్ తో కలిసి బీంపూర్ మండలం అర్లి-టీ గ్రామంలో నీట మునిగిన పంట పొలాలు,దెబ్బతిన్న రోడ్లు,వంతెనలను పరిశీలించారు.