యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండపై రుద్రాభిషేకం
యాదాద్రి భువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి కొండపై వేంచేసి ఉన్న పర్వత వర్ధిని సమేత రామలింగేశ్వర స్వామికి సోమవారం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభావత వేళలో మొదటగా పరమశివుడిని కొలుస్తూ సుమారు గంటన్నర పాటు జరిగిన రుద్రాభిషేకంలో భక్తులు మమేకమయ్యారు .పరమశివుడికి ఆవు పాలు పంచామృతాలతో అభిషేకించి విభూదితో, అలంకరణ చేసి అర్పించారు .భక్తులు ప్రత్యేకమైన పూజలు చేపట్టారు