అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం లోని గుత్తి మండలం వన్నె దొడ్డి వద్ద జాతీయ రహదారిపై ఎద్దుల బండిని కారు వేగంగా వచ్చి ఢీకొన్న ఘటనలో ఎద్దు అక్కడికక్కడే మృతిచెందగా రైతు మల్లికార్జున కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అతనిని గురువారం రాత్రి అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి 108 సహాయంతో తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.