ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనంతో నగరంలో కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు నగరంలో వర్షాలు కురుస్తుండడంతో నగరంలోని పలు ప్రాంతాలను మంగళవారం కమిషనర్ పరిశీలించారు ప్రజల నుంచి వచ్చిన సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించి ఎక్కడ వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు.