కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం శివారులోని అక్కమాంబ కొండ మలుపు వద్ద రోడ్డు ప్రమాదం, పలువురికి గాయాలు
కళ్యాణదుర్గం శివారులోని అక్కమాంబ కొండ మలుపు వద్ద మంగళవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటో-కారు వేగంగా ఢీకొన్నాయి. ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారు బోరంపల్లి వాసులుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.