ప్రకాశం జిల్లా కొండపి పట్టణంలో నవంబర్ 14వ తేదీన విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని గురువారం విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. పట్టణంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం పట్టణంలో విద్యుత్ సరఫరా ఉండదు అనే విషయాన్ని ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.