బజార్హత్నూర్: పిప్రి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన డిప్యూటీ సీఎం ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో బుదవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, వెడ్మ బొజ్జ, జిల్లా కలెక్టర్ రాజార్షిషా, ఐటిడిఏ పిఓ కుష్బూగుప్తా, అధికారులు తదితరులు ఉన్నారు.