అనంతపురం నగర శివారులోని కామారుపల్లి వద్ద జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఆలమూరుకు చెందిన సాయి సిద్ధార్థ అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.