బస్సు ఢీ కొనడంతో మహిళ మృతి చెందిన విషాద ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. సికింద్రాబాద్ నుంచి గజ్వేల్ వెళ్తున్న దంపతులను వెనుక నుంచి కరీంనగర్కు చెందిన ఎలక్ట్రిక్ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో అనూష అనే మహిళ స్పాట్లోని మృతి చెందింది. ఈ ప్రమాదంలో మహిళ భర్తకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.