కడప జిల్లా ప్రొద్దుటూరులో విద్యా వ్యాపారాన్ని నిరసిస్తూ ఏఐఎస్ఎఫ్ రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర శుక్రవారం చేరింది.ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ జి. వలరాజు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యను వ్యాపారంగా మార్చే విధానాన్ని నిలిపివేయాలని, పెండింగ్లో ఉన్న ₹6,400 కోట్ల ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.కడప జిల్లాలో ఏర్పడిన యూనివర్సిటీల్లో ఇప్పటివరకు స్టాఫ్ నియామకాలు జరగకపోవడం కూటమి ప్రభుత్వ వైఫల్యమని విమర్శించారు. జి.ఓ. నెం:77 ను రద్దు చేసి, పేద విద్యార్థులకు ఉచిత విద్యా అవకాశాలు కల్పించాలని పిలుపునిచ్చారు.