ప్రకాశం జిల్లా టిడిపి అధ్యక్షుడు కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి మంగళవారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కలిసి ఇటీవల ప్రకాశం జిల్లా టిడిపి అధ్యక్షుడిగా ఉగ్ర నరసింహారెడ్డిని ప్రకటించడంపై సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన పదవికి వన్నెతెచ్చేలా పనిచేస్తానని 2029 ఎన్నికలలో జిల్లాలో అత్యధికంగా ఎమ్మెల్యే సీట్లు సాధించేలా చూస్తానన్నారు.