పేదలకు ఇచ్చిన స్థలాల జోలికి వస్తే ఊరకనే ఉండే ప్రసక్తే లేదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కేశవరెడ్డి అన్నారు. తాడిపత్రి మండలం అక్కన్నపల్లి గ్రామంలో సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూ పోరాటం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 1998లో అక్కన్నపల్లి గ్రామంలో 94 మంది పేద మహిళలకు ఇంటి స్థలాలు ఇచ్చారన్నారు. అయితే వాటిని దౌర్జన్యపరులు ఆక్రమించాలని చూస్తున్నారన్నారు. పేదల స్థలాలను తాము కాపాడి తీరుతామన్నారు.